: ముందు మీ నిధి ఖర్చు పెట్టండి... ఆపై మేమిస్తాం: తెలుగు సీఎంలకు వెంకయ్య సలహా

గడచిన పది రోజుల వ్యవధిలో కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, తాను స్వయంగా వరదల్లో మునిగిన ప్రాంతాలను పరిశీలించానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఢిల్లీలో మాట్లాడిన ఆయన, కేంద్రం నుంచి వచ్చే సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్రాల వద్ద ఉన్న విపత్తు నిధి నుంచి డబ్బు ఖర్చు చేసి బాధితులను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ సీఎంలకు సలహా ఇచ్చారు. పంట నష్టం అంచనాలపై కేంద్ర మంత్రులకు తాను వివరించి చెప్పానని, కేంద్ర బృందాలను పంపాలని సిఫార్సు చేశానని వివరించారు. రెండు రాష్ట్రాలూ పంట నష్టం అంచనాలను పంపిన తరువాత అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని చెప్పారు. కేంద్రం నిధులు వచ్చేలోగా ప్రభుత్వం వద్ద ఉన్న నిధిని ఖర్చు చేయాలని సలహా ఇచ్చారు. ఆపై కేంద్రం నుంచి నిధులందుతాయని తెలిపారు.

More Telugu News