: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండ‌లం కాల్వలపల్లి వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో ఆగి ఉన్న‌ ఆటోను వేగంగా వ‌చ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్ర‌మాదంలో నలుగురు ప్ర‌యాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మ‌రి కొంత మందికి గాయాల‌య్యాయి. స్థానికులు స‌మాచారం ఇవ్వడంతో, ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని గాయాల‌పాల‌యిన వారికి ద‌గ్గ‌ర‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

More Telugu News