: సింధు జ‌లాల ఒప్పందంలో భారత్ నిర్ణయంపై పాక్ లో అలజడి..అంత‌ర్జాతీయ కోర్టుకు వెళ్లాలని యోచన

సింధు న‌దీ జ‌లాల ఒప్పందాన్ని భార‌త్ పునఃస‌మీక్షించ‌డం ప‌ట్ల పాకిస్థాన్‌లో అల‌జ‌డి రేగుతోంది. ఈ అంశంపై అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో తేల్చుకుంటామ‌ని పాక్ పేర్కొంది. ఈ విష‌యాన్ని పాక్ ప్ర‌ధానికి విదేశీ వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు స‌ర్తాజ్ అజీజ్ మీడియాకు చెప్పారు. భార‌త్ తీసుకుంటున్న ఈ నిర్ణయం అంత‌ర్జాతీయ చ‌ట్టం ప్ర‌కారం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆయ‌న అన్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. అందులోంచి భార‌త్ ఏక‌ప‌క్షంగా త‌ప్పుకునే అవ‌కాశం లేద‌ని పేర్కొన్నారు. గ‌తంలో జ‌రిగిన కార్గిల్‌, సియాచిన్ యుద్ధాల స‌మ‌యాల్లోనూ ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉప‌సంహ‌రించుకోలేద‌ని ఆయ‌న అన్నారు. 'ర‌క్తం, నీళ్లు క‌లిసి ప్ర‌వ‌హించ‌లేవు' అని పేర్కొంటూ నిన్న భార‌త్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. సింధు జ‌లాల ఒప్పందంపై స‌మీక్ష అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సింధు జ‌లాల‌ను న్యాయ‌ప‌రంగా పూర్తిగా వాడుకుంటామ‌ని అన్నారు.

More Telugu News