: యూపీలో మంత్రి వర్గ విస్తరణ..10 మంది కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం

సీఎం అఖిలేష్ యాదవ్ యూపీ మంత్రి వర్గాన్ని ఎనిమిదోసారి విస్తరించారు. మంత్రివర్గంలోకి కొత్తగా 10 మంది మంత్రులను తీసుకున్నారు. ఇటీవల ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతికి కూడా మళ్లీ మంత్రి పదవి దక్కడం గమనార్హం. పది మందిలో ఏడుగురికి కేబినెట్ హోదా, ముగ్గురికి సహాయ మంత్రి హోదా దక్కింది. గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి వివరాలు.. గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, శివకాంత్ ఓఝా, మనోజ్ పాండే, రవిదాస్, నరేంద్ర వర్మ,యాసిర్ షా, పాంఖ్లాల్ మాఝి, అభిషేక్ మిశ్రా, జియావుద్దీన్ రిజ్వీ, రియాజ్ అహ్మద్. ఈ కార్యక్రమంలో సీఎం అఖిలేష్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన సోదరుడు యూపీ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ శివలాల్ సింగ్ యాదవ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

More Telugu News