: చిన్నారులతో బందీలను చంపించడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది!: ఐసిస్‌ ఉగ్రవాది ఒమర్

సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఆపై ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరి జిహాదీగా మారిన బ్రిటన్‌కు చెందిన ఉగ్రవాది బ్రిట్ ఒమర్ హుస్సైన్ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తనకు చంపడమంటే ఎంతో ఇష్టమని, బ్రిటన్ సైనికులను కసిదీరా చంపాలని ఉందని పేర్కొన్నాడు. ‘ది డైలీ స్టార్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమర్ మాట్లాడుతూ చిన్నారులతో బందీలను చంపించడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని, యుద్ధానికి ఇప్పటి నుంచే సన్నద్ధమవుతారని చెప్పాడు. తన కుమారుడితోనూ బందీలను చంపిస్తున్నానన్న ఒమర్, అందుకు తాను ఎంతో సంతోషిస్తున్నట్టు చెప్పాడు. చిన్నారులను ఇప్పటి నుంచే అలా తీర్చిదిద్దకుంటే పిరికిపందలు అయ్యే ప్రమాదం ఉందన్నాడు. ఇటీవల ఐసిస్ విడుదల చేసిన వీడియోలో కనిపించిన ఒమర్ బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కేమరూన్‌కు గతంలో సవాలు విసిరినట్టు తెలిపాడు. బ్రిటన్ సైన్యంతో ప్రత్యక్షంగా తలపడాలని ఉందని, సైన్యాన్ని పంపించాలని తాను వ్యక్తిగతంగా కేమరూన్‌ను కోరినట్టు వివరించాడు.

More Telugu News