: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. మరో ముగ్గురు ప్రయాణికులు, కండక్టరు బస్సులోనే ఇరుక్కుపోయారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులు, కండక్టర్‌ను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

More Telugu News