: బాలకృష్ణ ఫ్యాన్స్ ఆలిండియా కన్వీనర్ ఇంటిపై ఐటీ దాడులు

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆలిండియా కన్వీనర్ నంబూరి సతీష్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లో ఒక సినీ నిర్మాత ఇంటిపై దాడి చేయగా, అక్కడ కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారం మేరకు హిందూపురంలోని నంబూరి సతీష్ ఇంటిపై కూడా దాడి చేసి రూ.2 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News