: 500వ టెస్ట్ ఆడుతున్న టీమిండియా.. మరోపక్క 250వ టెస్ట్‌కు సన్నద్ధమవుతోంది!

అదేంటి? 500వ టెస్ట్ ఆడుతున్న భారత్ 250వ టెస్ట్‌కు సిద్ధమవడమేంటని అనుకుంటున్నారా? నిజమే, కాన్పూరులో న్యూజిలాండ్‌తో 500 వ టెస్ట్ ఆడుతున్న కోహ్లీ సేన అదే జట్టుతో 250వ టెస్ట్ ఆడనుంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌గార్డెన్స్ ఇందుకు వేదిక కానుంది. టీమిండియాకు కాన్పూరు టెస్ట్ ఓవరాల్‌గా 500 టెస్ట్ కాగా ఈనెల 30న ఈడెన్‌గార్డెన్స్‌లో అదే జట్టుతో జరగనున్న మ్యాచ్ స్వదేశంలో 250వ టెస్ట్ మ్యాచ్. ఈ టెస్ట్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అచ్చం లార్డ్స్‌లో లాగానే గంట మోగించి టెస్ట్‌ను ప్రారంభించనున్నారు. చారిత్రక టెస్ట్ సందర్భంగా టికెట్ ధరలు తగ్గించాలని నిర్ణయించినట్టు క్యాబ్ కార్యదర్శి అభిషేక్ దాల్మియా తెలిపారు. అలాగే మొదటిరోజు నాలుగు వేల మంది పేద చిన్నారులకు మ్యాచ్‌ను వీక్షించే అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News