: మరోసారి వచ్చినప్పుడు మాతో డిన్నర్ చేయాల్సిందే!: ధోనీకి హీరో సూర్య ట్వీట్

"మరోసారి చెన్నై వస్తే మాతో డిన్నర్ చేయాలి. మీరు చూపిన ఆప్యాయతకు ధన్యవాదాలు. మా పిల్లలకు మధురమైన క్షణాలను అందించారు" అని హీరో సూర్య, భారత జట్టు వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ట్వీట్ చేశారు. తన బయోపిక్ 'ఎమ్‌ఎస్‌ ధోని: ది అన్‌ టోల్డ్‌ స్టోరీ' ప్రమోషన్ నిమిత్తం ధోనీ చెన్నైకి వచ్చిన సందర్భంగా, భార్య జ్యోతిక, పిల్లలు దివా, దేవ్ సహా సూర్య ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. సూర్య పిల్లలు ధోనీతో కొంతసేపు గడపగా, ఆ చిత్రాలను ట్వీట్ చేసిన సూర్య, ఇంకోసారి చెన్నై వస్తే, తమ ఇంట డిన్నర్ కు రావాలని చెప్పారు. ఈ చిత్రం సెప్టెంబరు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

More Telugu News