: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది వ్య‌వ‌సాయ కూలీల మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని ఉజ్జయని దేవాస్‌ రోడ్డులో మినీ ట్రక్కును లారీ ఢీకొట్ట‌డంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 15 మంది గాయాల‌పాల‌య్యారు. క్ష‌తగాత్రుల్లో ఓ గర్భిణీ కూడా ఉంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వీరందరినీ వ్య‌వ‌సాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. గాయాల‌పాల‌యిన వారిని పోలీసులు అంబులెన్స్ ద్వారా ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

More Telugu News