: ఆపిల్ చేతికి హైదరాబాదు సాఫ్ట్ వేర్ స్టార్టప్ కంపెనీ

టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ చేతిలోకి హైదరాబాదుకు చెందిన సాఫ్ట్ వేర్ స్టార్టప్ కంపెనీ వెళ్లింది. హైదరాబాదు ఆధారిత మెషీన్ లెర్నింగ్ సాఫ్ట్ వేర్ సంస్థ 'తుప్ల్ జంప్'ను యాపిల్ కొనుగోలు చేసింది. 2013లో రోహిత్ రాయ్, బుద్ధవరపు సత్య ప్రకాష్, దీపక్ ఆలూరు సహ వ్యవస్థాపకులుగా 'తుప్ల్ జంప్'ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ యూనిక్ సాఫ్ట్ వేర్ ద్వారా పెద్దమొత్తంలో కంపెనీల డాటా స్టోర్, ప్రాసెస్, విజువలైజ్ చేసే అంశాల్లో విశేషమైన సేవలందిస్తోంది. అపాచీ స్పార్క్ ప్రాసెసింగ్ ఇంజిన్, అపాచీ కాసాండ్రా, ఎన్ఓఎస్ క్యూఎల్ డేటాబేస్ లాంటి ఓపెన్ సోర్స్ లాంటి డేటా టూల్స్ లో మంచి ప్రవేశం ఉందని వెంచురీ బీట్ వ్యాఖ్యానించింది. రోహిత్ రాయ్, సత్యప్రకాశ్ ఇప్పటికే యాపిల్ లో చేరారని, దీపక్ ఆలూరు అనప్లాన్ లో చేరారని వెంచురీ బీట్ తెలిపింది. యాపిల్ టెక్ సంస్థల విస్తరణలో భాగంగా చిన్న సంస్థలను కొనుగోలు చేస్తోందని టెక్ క్రంచ్ తెలిపింది. అయితే ఈ డీల్ విలువతో పాటు మరింత సమాచారం తెలియాల్సి ఉందని పేర్కొంది.

More Telugu News