: పాకిస్థాన్ కు దీటుగా సమాధానం చెప్పాలి: సుబ్రహ్మణ్యస్వామి

జమ్మూకాశ్మీర్ లోని యూరీ ఘటనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. పాకిస్థాన్ కు దీటుగా సమాధానం చెబితేనే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదాలు ముగుస్తాయని అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. చర్చల మాట అటుంచి, పాక్ కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని, మాటల కంటే చేతలే ఎక్కువ మాట్లాడతాయనే విషయాన్ని మోదీ ప్రభుత్వానికి ఆయన గుర్తుచేశారు.

More Telugu News