: లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి: సీఎం చంద్రబాబు ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో కురుస్తోన్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. గుంటూరు, కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో చెరువుకి గండి పడింది. ఇప్పర్ల ఎత్తిపోతల కాల్వకు భారీగా వరద నీరు వచ్చింది. వర్షాలపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తగ్గించే విధంగా అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు.