: ఈజిప్టు మధ్యధరా సముద్ర తీరంలో పడవ బోల్తా 400 మంది గల్లంతు

ఈజిప్టు మధ్యధరా సముద్ర తీరంలోని కర్ఫ్ ఎల్ షేక్ వ‌ద్ద‌ ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. 600 మందితో వెళుతోన్న‌ ప‌డవ బోల్తా పడింది. ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తోన్న వారంతా ఈజిప్టియన్లు, సరియన్లు, సుడాన్ వాసులు, సోమాలియన్లని, వారు ఇత‌ర‌ దేశంలోకి శరణార్థులుగా వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. వారిలో 400 మంది గల్లంతయ్యారని, 42 మంది మృతి చెందార‌ని పేర్కొన్నారు. గ‌ల్లంత‌యిన వారి కోసం సిబ్బంది గాలింపు చర్యలు చేప‌డుతున్నారు. ప‌డ‌వ ప్ర‌మాదంపై వెంట‌నే స్పందించిన కోస్ట్ గార్డు సిబ్బంది 150 మందిని కాపాడరని వారు చెప్పారు. వారిని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు.

More Telugu News