: కాశ్మీర్లోని ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదుల పని పడుతున్న ఆర్మీ

యూరీ సెక్టార్ లో ఉగ్రవాదుల దురాగతానికి ప్రతీకారం తీర్చుకోవాలని యావద్భారతావని డిమాండ్ చేస్తున్న వేళ కాశ్మీర్ లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం ఆర్మీకి అందింది. బందిపొర జిల్లాలోని అర్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం అందింది. దీంతో గ్రామానికి చేరుకున్న సైనికులు తనిఖీలు నిర్వహిస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆ ఇంటిని చుట్టుముట్టిన సైనికులు ఒక ముష్కరుడిని మట్టుపెట్టారు. మిగిలిన వారి పని పట్టేందుకు అదను కోసం వేచి చూస్తున్నారు.

More Telugu News