: ఉండవల్లి తన పుస్తకంలో నా గురించి గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు: జైపాల్ రెడ్డి

ఏపీ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన ‘విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు’ అనే పుస్తకంలో తన గురించి గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనలో తెలంగాణ ఎంపీలు, జైపాల్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమైందని ఉండవల్లి ఆ పుస్తకంలో రాశారని, అది నిజమేనని, అప్పుడు, తాము నిర్ణయాత్మక పాత్ర పోషించామని అన్నారు. కాగా, మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో జస్టిస్ చలమేశ్వర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

More Telugu News