: బేగంపేట అంధుల పాఠశాలలో మోకాళ్ల లోతు వరదనీరు

హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ క్రమంలో బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో, ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది. సుమారు 450 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి విద్యార్థులు ఎలాంటి అల్పాహారం తీసుకోలేదని సమాచారం.

More Telugu News