: 'రైల్వే బడ్జెట్ కు మంగళం'... ఆమోదించిన కేంద్ర క్యాబినెట్

గడచిన 92 సంవత్సరాల నుంచి సాధారణ బడ్జెట్ కు ముందు పార్లమెంట్ ముందుకు వచ్చే రైల్వే బడ్జెట్ ఇకపై కనిపించదు. ఈ మేరకు 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి సాధారణ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ను కూడా కలిపేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవలి కాలంలో ఆదాయం తగ్గి, మూలధన వ్యయాలు పెరిగాయన్న కారణాలు చూపుతూ, రైల్వే శాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి తేవాలని గత కొద్ది కాలంగా కేంద్రం ప్రతిపాదిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1న రైల్వే, కేంద్ర బడ్జెట్ లను కలిపి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక రెండు బడ్జెట్ల విలీనానికి పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి వుంది. జనవరి 25లోగా ఈ పని పూర్తయితేనే, ఫిబ్రవరి 1న సంయుక్త బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చే వీలుంటుంది.

More Telugu News