: తిరుమ‌ల శ్రీ‌వారికి తలనీలాలు సమర్పించుకున్న సినీ హీరో మ‌హేశ్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త

తెలుగు సినీ హీరో మహేశ్ బాబు భార్య నమ్రత ఈరోజు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని ద‌ర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో త‌మ కుమారుడు గౌతమ్‌, కుమార్తె సితారతో కలసి ఆమె శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వారికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు శ్రీ‌వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా నమ్ర‌త‌ తలనీలాలు సమర్పించుకొని మొక్కు చెల్లించుకున్నారు.

More Telugu News