: సుప్రీంకోర్టు చెప్పినా అమలు చేయలేం: 'కావేరి'పై చేతులెత్తేసిన సిద్ధరామయ్య

కావేరీ నదిలోనే నీరు లేనప్పుడు తమిళనాడుకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటి విడుదల ఆదేశాలను ఎలా అమలు చేయగలుగుతామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. కావేరీ పర్యవేక్షక కమిటీ రోజుకు 3 వేల క్యూసెక్కులు వదలాలని సూచించగా, దాన్ని రెట్టింపు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం చాలా కష్టమని అన్నారు. ప్రజలు శాంతంగా ఉండాలని ఆయన కోరారు. కాగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే అంశంపై సిద్ధరామయ్య తమ సహచర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను పరిశీలించి, న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. కాగా, తమ పొలాలకు నీరివ్వకుండా దిగువకు నీటిని వదులుతుండటంపై మాండ్యా జిల్లా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.

More Telugu News