: హైదరాబాద్‌లో కంపించిన భూమి.. బెంబేలెత్తిన జనం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూమి కంపించింది. భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. నగర శివారు జగద్గిరిగుట్ట పరిధిలోని బాపురెడ్డినగర్, దేవమ్మబస్తీ, సంజయ్ గాంధీ నగర్, పంచశీల కాలనీ, చెన్నారెడ్డి నగర్ ప్రాంతాల్లో రాత్రి 10:30 గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఓ ఇంటి పైకప్పులు పగిలి కిందపడ్డాయి. దీంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. మరోవైపు భూకంపం కారణంగానే ఇంటి పైకప్పు కూలిందా? లేక ఎవరైనా ఆ చుట్టుపక్కల పేలుడు పదార్థాలు ఉపయోగించారా? అన్న కోణాల్లోనూ అధికారులు ఆరా తీస్తున్నారు.

More Telugu News