: మోదీ, బాబు... ఈ ఇద్దరి జోడీ అభివృద్ధికి దోహదం చేస్తుంది : వెంకయ్యనాయుడు

ఢిల్లీలో మోదీ, రాష్ట్రంలో బాబు.. ఈ ఇద్దరి జోడీ అభివృద్ధికి దోహదం చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నెమ్మలూరులో బెల్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, విభజనతో నష్టపోయిన ఏపీకి సాయం చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక సంస్థలను ఏర్పాటు చేస్తోందన్నారు. రూ.6 వేల కోట్లతో ఏపీలో రక్షణ సంస్థల ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైందన్నారు. రాత్రి సమయంలో 3 కిలో మీటర్ల దూరం చూడగలిగే లెన్స్ ను బెల్ పరిశ్రమ తయారుచేస్తోందన్నారు. ఈ సంస్థ ఉత్పతుల్లో 87 శాతం రక్షణ శాఖకు చెందినవే అన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కొందరు నేతలు ఏపీకి ప్రత్యేకహోదా తప్ప మరేమీ అక్కర్లేదని అంటున్నారన్నారు. హోదాతోపాటు 28 కోరికలు కోరితే, వాటిలో 27 కోరికలు నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు.

More Telugu News