: కేటీఆర్ ను కలిసిన కాంగ్రెస్ నేత దానం నాగేందర్

తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ ను కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ కొద్దిసేపటి క్రితం కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు కేటీఆర్ తో మాట్లాడి బయటకు వచ్చిన దానం, తన వ్యక్తిగత పనుల నిమిత్తమే కలిశానని మీడియాకు వెల్లడించారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు. నయీమ్ దందాల వెనుక గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతగా ఉన్న దానం నాగేందర్ హస్తం కూడా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. నయీమ్ ఫామ్ హౌస్ పక్కనే దానం ఫామ్ హౌస్ కూడా ఉండటం, పలు సెటిల్ మెంట్లకు దానం నాగేందర్ సహకరించాడని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఒకప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ నేత కొండపల్లి సీతారామయ్య మరదలు హైమవతికి చెందిన భూమి కబ్జా విషయంలో దానంపై అభియోగాలు నమోదయ్యాయి కూడా.

More Telugu News