: విర్రవీగడం..విచారపడటం నాకు తెలియదు: మాజీ గవర్నర్ రోశయ్య

పదవులుంటే విర్రవీగడం.. లేకపోతే విచారపడటమనేది తన రాజకీయ జీవితంలో తనకు తెలియదని తమిళనాడు మాజీ గవర్నర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు సంబంధించి ఒక డిజైన్ చేసుకుని తాను ఎదగలేదని, ఆ సందర్భాలను అనుసరించి అవి అలా జరిగిపోయానని రోశయ్య చెప్పారు. తన రాజకీయ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోయిందన్నారు. తాను మొదటి నుంచి ఎన్జీరంగా శిష్యుడిని అవడంతో, రైతులతో తనకు మంచి సంబంధాలు ఉండేవన్నారు. రంగా గారి శిష్యులుగా మర్రి చెన్నారెడ్డితో తనకు పరిచయం ఏర్పడిందన్నారు.

More Telugu News