: మైఖేల్ జాక్సన్ ని చూసినప్పుడు అలా ఫీలయ్యాను: నటుడు ప్రభుదేవా

‘మెగాస్టార్ చిరంజీవిని చూసిన అభిమానులు ఎలా ఫీలవుతారో.. మైఖేల్ జాక్సన్ ని ముంబయిలో తాను చూసినప్పుడు అలానే ఫీలయ్యాను’ అని ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు ప్రభుదేవా అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ, గతంలో ముంబయిలో మైఖేల్ జాక్సన్ ని ఒకసారి కలిశానని, ఆయన్ని చూసిన తన్మయత్వంలో నోట మాట రాలేదని అన్నారు. మైఖేల్ జాక్సన్ ని కలిసిన సమయంలో ఆయన అభిమానులు, ప్రేక్షకులు విపరీతంగా ఉన్నారని, ఆ సందర్భంలో ఆయనేదో మాట్లాడారు కానీ, తనకు వినపడలేదని, ఆయన ముఖం మాత్రం అలా చూస్తూ ఉండిపోయానని చెప్పారు. మైఖేల్ జాక్సన్ ని కలిసిన సందర్భంలో ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఫొటో కూడా తీశారని, ఆ ఫొటో తన వద్ద లేదని ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా చెప్పారు.

More Telugu News