: ఈనెల 23న హాజరు కావాలంటూ జగన్ కు ఈడీ కోర్టు సమన్లు

వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. రాంకీపై ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేయడంతో ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈ మేరకు సమన్లు జారీ చేసింది. రాంకీ కేసులో మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ ఛార్జీషీట్ లో ఆరోపించింది. దీంతో జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, రాంకీ ఛైర్మన్ అయోధ్యరామిరెడ్డి, ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిలకు సమన్లు జారీ చేసింది. ఈనెల 23న కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం వారిని ఆదేశించింది. విశాఖలో భూముల రూపంలో భారీగా లబ్ధి పొందిన రాంకీ సంస్థ, జగతి పబ్లికేషన్స్ లో 10 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ ఛార్జిషీట్ లో పేర్కొంది.

More Telugu News