: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి మలేరియా!

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ మలేరియా వ్యాధి బారిన పడ్డాడు. జ్వరం తగ్గే వరకు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో, తన తాజా చిత్రం ‘రాజ్ రీబూట్’ ప్రచార కార్యక్రమంలో ఇమ్రాన్ హష్మీ పాల్గొనడం లేదన్న విషయాన్ని ఆయన సన్నిహితులు చెప్పారు. కాగా, విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజ్ రీబూట్ చిత్రం యూనిట్ మూడు రోజుల క్రితం జైపూర్ లో ప్రచార కార్యక్రమం నిర్వహించింది. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ జ్వరం కారణంగా తిరిగి ముంబయికి వెళ్లిపోయాడు. మిగిలిన యూనిట్ సభ్యులు అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంటారని తెలుస్తోంది.

More Telugu News