: కార్డియాలజిస్ట్ అవుతా: తెలంగాణ ఎంసెట్-3 తొలి ర్యాంకర్ మానస

భవిష్యత్తులో కార్డియాలజిస్ట్ అవ్వాలన్నదే తన లక్ష్యమని తెలంగాణ ఎంసెట్-3లో మొదటి ర్యాంక్ సాధించిన మానస పేర్కొంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మానస ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం వల్లనే ఈ విజయం సాధించానని చెప్పింది. అనంతరం ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఎంసెట్ లో టాప్ టెన్ ర్యాంకుల్లో ఏదో ఒక ర్యాంకు మానస సాధిస్తుందనుకున్నామని, అయితే, మొదటి ర్యాంకు సాధించడంతో తమకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

More Telugu News