: తెలంగాణ సాధన వ్యూహాన్ని తెలుసుకునేందుకు కేసీఆర్ ను కలవనున్న 'విదర్భ' వాదులు

మహారాష్ట్ర నుంచి విదర్భ ప్రాంతాన్ని విభజించి ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న విదర్భ రాష్ట్ర సమితి ప్రతినిధులు కేసీఆర్ ను ప్రత్యేకంగా కలవాలని నిర్ణయించుకున్నారు. తమ దశాబ్దాల కోరికను నెరవేర్చుకునేందుకు టీఆర్ఎస్ అధినేతను కలసి, ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నాన్ని, వ్యూహాన్ని గురించి తెలుసుకుంటామని విదర్భ నేతలు ధనుంజయ్ ఖండేవాలె, శ్రీహరి తదితరులు తెలిపారు. కేసీఆర్ తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లను కూడా కలసి మద్దతు కోరుతామని, భవిష్యత్తులో మరింతగా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం కలను నెరవేర్చుకుంటామని తెలిపారు.

More Telugu News