: ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు: కావూరి సాంబశివరావు

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని బీజేపీ నేత కావూరి సాంబశివరావు అన్నారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని, కేంద్రం సాయంతో ఏపీకి మేలు జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని కావూరి సాంబశివరావు విమర్శించారు.

More Telugu News