: చంద్రబాబు గారూ..మీ ఆలోచన ఏమిటి? రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు?: బొత్స

‘పోలవరం మెయిన్ ప్రాజెక్టును పక్కకు పెట్టి, ఇప్పుడు కాపర్ డ్యాం నిర్మిస్తామంటున్నారు. చంద్రబాబు గారూ, అసలు మీ ఆలోచన ఏమిటి? రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు?’ అంటూ వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రంలో తాకట్టు పెట్టారని అన్నారు. ‘ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని చెప్పినందుకే ప్రధానమంత్రికి బాబు థ్యాంక్స్ చెప్పారా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కోసమే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టుపెట్టారని ఆరోపించారు. అసలు కేంద్రం పరిధిలో ఉండాల్సిన పోలవరం ప్రాజక్టు రాష్ట్ర పరిధిలోకి ఎలా వచ్చిందని ఆయన నిలదీశారు. టెండర్లు లేకుండా పోలవరం ప్రాజెక్టుకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, సీఎం స్థాయి వ్యక్తి సబ్ కాంట్రాక్టులు నిర్ణయించడం చాలా దారుణమని అన్నారు.

More Telugu News