: ‘పాక్ నుంచి రక్షించండి’.. ఐక్య‌రాజ్య‌స‌మితి కార్యాల‌యం ముందు బ‌లూచిస్థాన్ వాసుల ప్ర‌ద‌ర్శ‌న‌

త‌మ ప్రాంతానికి స్వాతంత్ర్యం కావాల‌ని పోరాడుతున్న బలూచిస్థాన్ వాసులు ఈరోజు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఐక్య‌రాజ్య‌స‌మితి ప్రధాన కార్యాల‌యం ముందు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను చేప‌ట్టారు. త‌మ ప్రాంతంలో మాన‌వహ‌క్కులు మంట‌గలిసి పోతున్నాయంటూ నినాదాలు చేశారు. పాకిస్థాన్ త‌మ ప‌ట్ల కర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. పాక్ నుంచి త‌మ‌కు స్వాతంత్ర్యం కావాల‌ని, బ‌లూచిస్థాన్‌పై పాక్ బాంబుదాడులు ఆపాల‌ని వారు నినాదాలు చేస్తున్నారు.

More Telugu News