: ‘రేషన్ దుకాణాల్లో బాణసంచా విక్రయాలు వద్దు’.. ముఖ్యమంత్రి జయలలితకు ఉద్యోగుల వినతి

రానున్న దీపావళి పండుగ సందర్భంగా తమిళనాడులోని రేషన్ దుకాణాల్లోనూ బాణసంచా విక్రయించాలని అక్క‌డి అధికారులు ఇటీవ‌ల నిర్ణ‌యించుకొని ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిని సంబంధిత ఉద్యోగులు వ్య‌తిరేకిస్తున్నారు. చౌక‌ధ‌ర‌ల దుకాణాల్లో బాణసంచా విక్రయించడంపై నిషేధం విధించాలని వారు రాష్ట్ర సీఎం జ‌య‌ల‌లిత‌కు విన్న‌వించుకున్నారు. పేద‌ల‌కు స‌రుకులు అందించే రేషన్ దుకాణాలు చిన్న స్థలాల్లో ఏర్పాట‌య్యాయ‌ని ఉద్యోగులు అన్నారు. దుకాణాల్లో క‌నీసం స‌రుకులు ఉంచ‌డానికే స్థలం స‌రిపోవ‌డంలేద‌ని, బాణసంచాను ఎలా ఉంచుతామ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అధికారుల నిర్ణ‌యం భావ్యం కాద‌ని చెబుతున్నారు. బాణ‌సంచా కార‌ణంగా త‌లెత్తే ప్రమాదాలను అడ్డుకునేందుకు కూడా వసతులు లేవ‌ని చెప్పారు.

More Telugu News