: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురి మృతి

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రావెల్ లోడుతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ కారును ఢీకొట్టింది. కారుపై ట్రాక్టర్ లోని గ్రావెల్ పడటంతో మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి.ఈ సంఘటనలో నలుగురు మృతి చెందారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కారణంగా ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

More Telugu News