: గంధపు చెట్లకు స్వర్గధామం భారత్

ప్రపంచానికి చందనపు పరిమళాలను అందిస్తున్న అత్యంత కీలక దేశం మనదే. ప్రపంచంలోని గంధపు చెట్లలో 85 శాతం మనదేశంలోనే పెరుగుతున్నట్టు బెంగళూరుకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ సురేంద్ర కుమార్ తెలిపారు. గంధపు చెట్ల పెంపకం, ఉత్పత్తికి సంబంధించిన అంశాలపై రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం అనంతరం సురేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ మార్కెట్లో గంధపు చెట్ల ఉత్పత్తిలో భారత్ వాటా 85 శాతం అయితే, దేశం మొత్తం ఉత్పత్తిలో 70 శాతం కర్ణాటకలోనే పెరుగుతున్నట్టు ఆయన చెప్పారు.

More Telugu News