: తన కొడుక్కి చేతబడి చేశారంటూ వదినను కాల్చి చంపిన మరిది... తప్పించుకున్న అన్న

తన కొడుక్కి చేతబడి చేయించారనే అనుమానంతో వదినను మరిది హతమార్చాడు. విజయనగరం జిల్లా సాలూరు మండలం బింగిడి వలసలో ఈ దారుణం చోటుచేసుకుంది. తన కొడుక్కి బాణామతి చేయించారనే అనుమానంతో నాటు తుపాకీతో తన వదినను మరిది కాల్చి చంపాడు. అన్నను కూడా హతమార్చాలని చూడగా, ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడు.

More Telugu News