: మా పిల్లల పెళ్లిళ్ల గురించి నేనేమీ చెప్పలేదు... మీడియానే చెప్పేసింది!: నాగార్జున

యువహీరోలు నాగ చైతన్య, అఖిల్ ల వివాహం గురించి తానేమీ చెప్పలేదని, మీడియానే చెప్పేసిందని ప్రముఖ నటుడు నాగార్జున అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘పెళ్లిళ్ల మాట వాస్తవమే. కానీ, ఇంకా డేట్స్ ఫిక్స్ కాలేదు. అంతా ఫిక్స్ కాగానే, ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి, విందుభోజనం పెట్టి అన్ని వివరాలు చెబుతాను’ అని అన్నారు. ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం చాలా చక్కగా వచ్చిందని, హీరో హీరోయిన్లు బాగా చేశారని, సంగీతం... ప్రతి ఒక్కటీ అద్భుతంగా ఉన్నాయని నాగార్జున చెప్పారు.

More Telugu News