: హోదాతో లాభముంది... కానీ ఇచ్చే అవకాశం లేదు, ఇక మరచిపోండి!: వెంకయ్య కుండబద్దలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే, ప్రయోజనాలు అధికమన్న మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అంగీకరించారు. అయితే, రాష్ట్రానికి హోదా దక్కే అవకాశాలు లేవని, ఇక ఆ విషయాన్ని మరచిపోవాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఏ రాష్ట్రానికీ హోదా రాదని కుండబద్దలు కొట్టిన ఆయన, కాంగ్రెస్ కారణంగానే సమస్య ఉత్పన్నమైందని, అసలు చట్టంలోనే లొసుగులున్నాయని తెలిపారు. విభజన కారణంగా నష్టపోయిన ఏపీని ఆదుకుంటామని, హోదా వస్తే ఆరు నెలల్లో ప్రతి ఊరూ హైదరాబాద్ మాదిరిగా అవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.

More Telugu News