: దగ్గు మందు అక్రమ రవాణా.. భద్రతా దళాల కాల్పుల్లో స్మగ్లర్ మృతి

బంగ్లాదేశ్‌కు దగ్గు సిరప్‌ను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను నిలువరించేందుకు బీఎఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఒక స్మగ్లర్ మృతి చెందాడు. పశ్చిమబెంగాల్‌లోని మల్దా జిల్లాలోని ఈ ఘటన చోటుచేసుకుంది. దగ్గు మందును బంగ్లాదేశ్ యువకులు మత్తుమందుగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశానికి పెద్దమొత్తంలో దగ్గు సిరప్‌ను తరలించేందుకు ప్రయత్నిస్తున్న కొందరు యువకులను చౌరి అనంతపూర్ గ్రామం వద్ద గతరాత్రి భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ స్మగ్లర్ మృతి చెందాడు. స్మగ్లర్లను గుర్తించిన అధికారులు వారిని వెంబడించగా వారు సైనికులపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో అలోక్ కుమార్ అనే జవానుకు గాయాలయ్యాయి. దీంతో భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. కాల్పుల్లో 18 ఏళ్ల దిల్వార్ షేక్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీంతో భయపడిన ఇతర యువకులు అక్కడి నుంచి పరారైనట్టు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.

More Telugu News