: కాకినాడ సభలో మరణించిన అభిమాని కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కల్యాణ్
సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిన్న నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ అనంతరం ఒక అభిమాని బిల్డింగ్ పై నుంచి కిందపడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాజాగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా 5 లక్షల రూపాయలు అందజేస్తానని ప్రకటించి, పవన్ కల్యాణ్ తన ఉదారతను చాటుకున్నారు.