: గాంధీ విగ్రహం ముందు ఫుట్ పాత్ పై వైఎస్ జగన్!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ నిరసనలు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి మారాయి. మూడు రోజుల పాటు జరిగిన సమావేశాలకు నల్లరంగు చొక్కాలతోనే హాజరైన విపక్ష ఎమ్మెల్యేలు ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టి సభను స్తంభింపజేశారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. దీంతో సభ వెలుపలికి వచ్చిన వైసీపీ తన నిరసనను కొనసాగించేందుకే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తన ఎమ్మెల్యేలతో కలిసి గాంధీ విగ్రహం వద్దకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అక్కడే ఫుట్ పాత్ పై కూర్చున్నారు. ఈ ఆందోళనలో పాలుపంచుకునేందుకు అసెంబ్లీకి వచ్చిన పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఇప్పటికే సభ నుంచి సస్పెండ్ అయిన ఆర్కే రోజా కూడా జగన్ కు ఇరువైపులా ఫుట్ పాత్ పై కూర్చున్నారు.

More Telugu News