: రోజుకు 4 జీబీ డేటానే ఇస్తారట!... ‘జియో’ విధివిధానాలలో స్పష్టం!

జియో సిమ్ తీసుకునే వినియోగదారుడికి ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు వరకు అపరిమిత డేటాను ఉచితంగానే ఇవ్వనున్నట్లు ఇటీవలే ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కంపెనీ నుంచి విడుదలైన విధివిధానాలు పరిశీలిస్తే ముఖేశ్ అంబానీ ప్రకటన అవాస్తవమని తేలుతోంది. రోజుకు ఒక్కో వినియోగదారుడికి కేవలం 4 జీబీ డేటా మాత్రమే అందుబాటులో ఉంటుందట. ఈ 4 జీబీ డేటా అయిపోగానే కనీసం ఇంటర్నెట్ సర్ఫ్ చేసుకోవడం కుడా కుదరదట. ఇక హైస్పీడ్ ఇంటర్నెట్ ఉందన్న భావనతో సినిమాలు డౌన్ లోడ్ చేసుకునే వినియోగదారులు జియో సేవలతో మరింత ఇబ్బందులకు గురి కాక తప్పదన్న వాదన వినిపిస్తోంది.

More Telugu News