: ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి ఉబికివస్తున్న గ్యాస్... తాడికోన గ్రామాన్ని ఖాళీ చేస్తున్న ప్రజలు

తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం రేపుతోంది. అల్లవరం మండలం తాడికోన గ్రామంలో ఓఎన్జీసీ బావి తవ్వుతుండగా గ్యాస్ ఎగజిమ్ముతోంది. గ్యాస్ ఉబికి వస్తుండడంతో తాడికొండ గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ఓఎన్జీసీ తవ్వుతున్న రిగ్ వద్ద తాడికోన గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, రిగ్ కు చుట్టూ గల 500 మీటర్ల ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. భయాందోళనలకు గురవుతున్న గ్రామస్థులు ప్రాణాలరచేతుల్లో పెట్టుకుని గ్రామం ఖాళీ చేస్తున్నారు. కాగా, గతంలో నగరం ఘటనలో గ్యాస్ లీకేజీ కారణంగా పెనువిపత్తు సంభవించిన సంగతి తెలిసిందే.

More Telugu News