: జైలు టాయ్ లెట్ గోడ పగులగొట్టి పరారైన బాల నేరస్తులు

జైలు గోడలు పగులగొట్టి మరీ బాల నేరస్తులు పరారైన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జైపూర్ లోని జువైనల్ హోంలోని 16 మంది బాల నేరస్తులు ప్రాంగణంలో ఉన్న టాయిలెట్ గోడను పగులగొట్టి పరారయ్యారని పోలీసు అధికారి తెలిపారు. వీరిలో 15 మంది పరారీలో ఉండగా, ఒక బాలుడు నేరుగా ఇంటికి వెళ్లాడు. అతనిని పట్టుకున్న కుటుంబ సభ్యులు నేరుగా పోలీసు అధికారులకు అప్పగించారు. మిగిలిన 15 మంది కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు.

More Telugu News