: ప‌వ‌న్ కల్యాణ్ స‌భ‌కు మ‌ద్ద‌తిస్తున్నాం: సీపీఐ రామ‌కృష్ణ‌

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని సీపీఐ ఏపీ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... ఈరోజు తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక హోదా కోసం నిర్వ‌హిస్తోన్న బ‌హిరంగ‌ స‌భ‌కు తాము మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. హోదాపై కేంద్రం మాట త‌ప్పిందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్యాకేజీ పేరుతో మ‌రోసారి మోసం చేశారని ఆయ‌న మండిప‌డ్డారు. కేంద్రమంత్రి వెంక‌య్య నాయుడు ఆంధ్ర ప్ర‌జ‌ల‌ని క‌చ్చితంగా మోసం చేశారని రామ‌కృష్ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంక‌య్య‌ను ప్ర‌జ‌లు మోస‌గాడిగానే చూస్తారని ఆయ‌న వ్యాఖ్యానించారు. హోదా కోసం ప్ర‌జ‌లంతా నిర‌స‌న‌లు తెలుపుతున్నార‌ని, రేప‌టి బంద్‌కు అంద‌రూ స‌హ‌క‌రించాలని ఆయ‌న కోరారు. హోదా సాధించుకునే క్ర‌మంలో అంద‌రూ క‌లిసి పోరాడాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

More Telugu News