: పవన్ కల్యాణ్ ను చూడడానికి భారీగా తరలివచ్చిన అభిమానులు.. పోలీసుల లాఠీఛార్జ్
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రానివేళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు తెలుపుతున్నారు. మరోవైపు రేపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయూ గ్రౌండ్ లో జనసేనాని, సినీనటుడు పవన్ కల్యాణ్ ఇదే అంశంపై బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కొద్ది సేపటి క్రితం కాకినాడకు చేరుకున్న ఆయనను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో స్వల్పంగా తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అభిమానులపై లాఠీఛార్జి చేశారు. జీఆర్టీ హోటల్ లో ఆయన బస చేస్తున్నారు. ఏపీలో ఆందోళనలు ఉద్ధృతమవుతోన్న వేళ రేపటి పవన్ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.