: 'ఆవాజ్-ఇ-పంజాబ్' పార్టీని ప్రకటించిన సిద్ధూ

బీజేపీ మాజీ నేత, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన సొంత పార్టీ 'ఆవాజ్-ఇ-పంజాబ్'ను ప్రకటించారు. పంజాబ్ ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ, పంజాబ్ ప్రతిష్టను తిరిగి తీసుకువచ్చేందుకే తాను ఈ పార్టీని స్థాపించానని, తమ పార్టీలో మంచి వ్యక్తులకు స్థానం ఉంటుందని చెప్పారు. కాగా, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, అకాలీదళ్ నేత పర్గత్ సింగ్ లతో కలిసి ఈ పార్టీని సిద్ధూ స్థాపించారు.

More Telugu News