: హోదాకే కట్టుబడి ఉన్నాం.. నిన్నటి ప్రకటనలో సానుకూల అంశాలను మాత్రమే స్వాగతిస్తున్నాం: మంత్రి గంటా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు ఉద్ధృత‌మ‌వుతోన్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు స్పందించారు. ఈరోజు శాస‌న‌మండ‌లిలో మాట్లాడిన ఆయ‌న‌.. తాము హోదాకే కట్టుబడి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. నిన్న కేంద్ర‌ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్ర‌క‌ట‌న‌ పట్ల రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సానుకూలంగా ఉన్నారంటూ వ‌స్తోన్న వార్త‌ల‌ను ఆయ‌న వ్య‌తిరేకించారు. నిన్నటి ప్ర‌క‌ట‌న‌లో రాష్ట్రానికి సానుకూలంగా ఉన్న అంశాల‌ను మాత్ర‌మే తాము స్వాగ‌తిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు

More Telugu News