: గ‌ణేశ్ నిమ‌జ్జ‌న స‌మ‌యంలో కానిస్టేబుల్‌పై దాడి.. హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు

మహారాష్ట్రలోని థానేలో ఓ కానిస్టేబుల్‌పై హ‌త్యాయ‌త్నం చేశారు ఆక‌తాయిలు. సీసీ కెమెరాల ద్వారా ఈ దారుణ ఘ‌ట‌నే వెలుగులోకి వ‌చ్చింది. గ‌ణేశ్ నిమ‌జ్జ‌న స‌మ‌యంలో ఓ బావి వ‌ద్దకు చేరుకున్న ముగ్గురు యువ‌కులు అక్క‌డ ఉన్న కానిస్టేబుల్ ని బావిలోకి తీసుకెళ్లి నీటిలో ముంచారు. ఆ త‌రువాత నీళ్ల‌లోంచి బ‌య‌ట‌కు లాక్కొచ్చి దాడి చేశారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. యువ‌కుల‌పై హ‌త్యాయ‌త్నం కేసును న‌మోదుచేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

More Telugu News