: నాకు చిర్రెత్తితే సజీవంగా తినేస్తా...!: ఉగ్రవాదులకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి వార్నింగ్

ఒబామాను తిట్టి, సారీ చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుట్టెరీ (71) తనదైన శైలి వ్యాఖ్యలతో మరోసారి కలకలం రేపారు. ఈసారి ఆయన ఉగ్రవాదులకు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఫిలిప్పీన్స్ లో 'అబూ సయ్యఫ్' ఉగ్రవాదులు దాడులకు పాల్పడి 15 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రోడ్రిగో డుట్టెరీ లావోస్ వెళ్తూ... తనకు తిక్క లేపవద్దని, చిర్రెత్తితే సజీవంగా తినేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. దాడులు మానుకోకపోతే ప్రజలందరి ముందూ బతికుండగానే తినేస్తానని ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్ మాఫియా నుంచి దేశాన్ని విముక్తి చేస్తానని అధికారం చేపట్టిన డుట్టెరీ, కేవలం రెండు నెలల్లోనే డ్రగ్ ఆరోపణలు ఉన్న 2,400 మందిని చంపించారు. మాజీ న్యాయవాది అయిన డ్యుటెర్టే తన విధానాలతో ఫిలిప్పైన్స్‌ తో పాటు ప్రపంచాన్ని కూడా విస్తుపోయేలా చేస్తున్నారు.

More Telugu News